PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నీర‌జ్ చోప్రాకి.. ఆనంద్ మ‌హింద్రా అదిరిపోయే బ‌హుమ‌తి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టోక్యో ఒలంపిక్స్ జావెలిన్ త్రో పురుషుల విభాగంలో నీర‌జ్ చోప్రా అద్భత ప్రద‌ర్శన చేశారు. దేశానికి తొలి స్వర్ణం అందించాడు. ఈ విజ‌యానికి ప్రముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హింద్రా అదిరిపోయే బ‌హుమ‌తి ప్రక‌టించారు. మ‌హీంద్రా సంస్థ నుంచి మార్కెట్ లోకి రాబోతున్న ఎక్స్ యూవీ 700 మోడ‌ల్ వాహ‌నాన్ని నీర‌జ్ చోప్రాకు బ‌హుమ‌తిగా ఇవ్వనున్నట్టు ఆయ‌న ట్విట్టర్లో వెల్లడించారు. తన వెనుక భారీ సైన్యంతో ఈటెను విసురుతున్న ప్రభాస్ ఫోటోతో పాటు .. నీర‌జ్ చోప్రా ఈటెను విసురుతున్న ఫోటోను ఆనంద్ మ‌హింద్ర షేర్ చేశారు. ఈ ట్విట్ కు రితేష్ జైన్ అనే నెటిజ‌న్ .. ఎక్స్ యూవీ 700 మోడ‌ల్ వెహిక‌ల్ ఇవ్వాలంటూ కామెంట్ చేశాడు. దీనికి ఆనంద్ మ‌హింద్రా స్పందిస్తూ.. ఎక్స్ యూవీ 700 మోడ‌ల్ వాహ‌నాన్ని సిద్ధం చేయాలంటూ త‌న కంపెనీ ఉద్యోగుల‌కు ఆదేశించాడు.

About Author