PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం..తప్పిన పెను ప్రమాదం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉండగా..వెంటనే మేల్కొన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్విచక్ర వాహనం నుండి కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది.మండల పరిధిలోని రోళ్ళపాడు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో అలగనూరు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ రూపేష్ తన ద్విచక్ర వాహనంపై మిడుతూరు నుండి అలగనూరుకు విధులకు వస్తూ ఉండగా అదేవిధంగా గడివేముల నుండి నందికొట్కూరుకు వెళ్తున్న వరిగడ్డి ట్రాక్టర్ మలుపు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా రాంగ్ రూటులో వస్తూ ఉండడాన్ని చూసిన  ఇంజనీరింగ్ అసిస్టెంట్ రూపేష్ తన బైకు నుండి కిందకు దూకేశాడు.వరిగడ్డితో ఉన్న ట్యాలీ ద్విచక్ర వాహనంపై బోల్తా పడింది.రూపేష్ కు మూగ దెబ్బలు తగిలాయని చికిత్స నిమిత్తం అతను ఆసుపత్రికి వెళ్లాడని స్థానికులు తెలిపారు.అదేవిధంగా ట్రాక్టర్ మరియు బైక్ ను మిడుతూరు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారని స్థానికులు తెలియజేశారు.

About Author