PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో వైసిపి నిర్లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం మీడియా సమావేశంలో కోడుమూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మీసాల ప్రేమ్ కుమార్ కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ సద్దల మధు కిషోర్ గారు కోడుమూరు మండల అధ్యక్షుడు సురేంద్ర సమావేశంలో మీసాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చనందున వాటిపై చార్జిషీట్ అభియోగ పత్రం వేసి వారు ఏ ఏ పథకాలు హామీ ఇచ్చారు అవి అమలు గాని పక్షాన వాటిని ప్రజల నుండి స్వీకరించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై అభియోగం మోపి వారిని ప్రజాకోర్టులో దోషులుగా చేసి రాబోయే ఎలక్షన్లలో వారి తప్పులను ఎత్తిచూపుతూ వారు ఇచ్చిన హామీలపై చూపించిన నిర్లక్ష్యం పట్ల ప్రజలే తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలను మేల్కొలుపుతూ ఈరోజు ఏడో తారీఖు నుండి 12 వ తారీకు వరకు గ్రామాల్లో మండలాలలో నియోజకవర్గ కూడలిలో సమావేశాలు నిర్వహించి ప్రజల నుండి కంప్లైంట్ పత్రాలు స్వీకరించి బిజెపి రాష్ట్ర నాయకత్వానికి సమర్పించడం జరుగుతుంది.

About Author