PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీటీడీ బోర్డు మెంబర్ గా నెరుసు నాగ సత్యం ప్రమాణస్వీకారం..

1 min read

– ఆలయ అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం..

– నగరవాసికి అరుదైన అవకాశం..

– కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్జీవో సంఘ అధ్యక్షుడు

– చోడగిరి శ్రీనివాస్, సంఘ సభ్యులు..

పల్లెవెలుగు  వెబ్ ఏలూరు జిల్లా :  తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యునిగా ఏలూరు వాసి తంగిళ్లముడి ప్రాంతానికి చెందిన నెరుసు నాగ సత్యం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ఆలయ అధికారులు జయ విజయ ద్వారం వద్ద వేదమంత్రాల నడుమ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి నాగ సత్యం తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగ సత్యం తండ్రి  నెరుసు సుబ్బారావు. సోదరులు ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి నెరుసు వెంకట రామారావు మరియు నెరుసు వెంకట చలపతి వారి కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు. ఏలూరు నగర వాసులు ఆయనకు  అరుదైన అవకాశం రావడంతో ఆ దైవ సన్నిధిలో సేవ చేసే అదృష్టాన్ని కల్పించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బోర్డు మెంబర్ గా ఎన్నిక కావడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పాలక మండల సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆయన సోదరుడు ఎన్జీవో సంఘంలో కార్యదర్శిగా పనిచేయటంతో ఆ సంఘ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు మరియు సభ్యు సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఎన్నిక తో నగరంలో పండగ వాతావరణం సంతరించుకుంది.

About Author