PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాదంలో నెస్లే ఇండియా !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఇండియా వివాదంలో చిక్కుకుంది. కిట్ క్యాట్ చాక్లెట్ రేపర్ పై దేవతల చిత్రాలు ముద్రించడం వివాదానికి కారణమైంది. ఈ చాక్లెట్‌ రేపర్‌పై జగన్నాథ స్వామితో పాటు బాలభద్ర, సుభద్ర మాతా చిత్రాలను ముద్రించింది. ఈ చర్యతో మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు ప్రకటించుకున్నారు. చాక్లెట్‌లు తిన్నాక ఎక్కడ పడితే అక్కడ రేపర్‌లను పడేస్తారన్నది వాళ్ల అభ్యంతరం. ఈ నేపథ్యంలో కొందరు ట్విటర్‌ వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై నెస్లే స్పందించింది. ‘ఆర్ట్‌ను, ఆర్టిస్టులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

          

About Author