NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బోస్ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందనడం అర్థరహితం

1 min read


పల్లెవెలుగు వెబ్: నేతాజీ సుభాష్ చంద్రబోస్, భ‌గ‌త్ సింగ్‌ల‌కు మ‌హాత్మాగాంధీ నుంచి స‌రైన మద్దతు ల‌భించ‌లేదన్న కంగనా వ్యాఖ్యలపై నేతాజీ కూతురు అనితా బోస్ స్పందించారు. నేతాజీని నియంత్రించ‌లేనని గాంధీ భావించేవార‌ని, అయితే… గాంధీజీని నేతాజీ ఎంత‌గానో ఆరాధించేవార‌ని ఆమె తెలిపారు. ఇద్దరూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన హీరోలేన‌ని, వారిద్దరిదీ సంయుక్త పోరాట ఫ‌లిత‌మే స్వాతంత్ర్యమన్నారు. గాంధీజీ అహింసా మార్గంతో పాటు, నేతాజీ.. భార‌త జాతీయ సైన్యం ప్రయత్నం కూడా స్వాతంత్ర్యం కోసం ఎంత‌గానో తోడ్పడిందన్నారు. అదే స‌మ‌యంలో కేవ‌లం నేతాజీ వ‌ల్లే స్వాతంత్ర్యం వచ్చింద‌ని చెప్పడం కూడా అర్ధహితమవుతుందని అనిత బోస్ అభిప్రాయపడ్డారు.

About Author