PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీనం దత్తాక్షేత్రంలో నూతన భవనం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్​,ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని దెందులూరు నియోజకవర్గం దొండపాడు గ్రామంలో ఉన్న శ్రీనం దత్తా క్షేత్రంలో సోమవారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ చేతుల మీదుగా నూతన భవన సముదాయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశీస్సులు పొందారు. ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి విచ్చేసినందుకు స్వామిజీకి నియోజకవర్గ ప్రజలందరి తరపున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి ప్రవచనం ఆలకించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వేణుగోపాల్ లూనాని,దత్త పీఠం భక్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు, దత్త జ్ఞానబోధ సభ ట్రస్టీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

About Author