PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉభయ తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లి: ఉభయ తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను కేంద్రం ప్రభుత్వం నియమించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్​ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ సతీష్​చంద్రశర్మ నియమితులయ్యారు. దేశంలోని అయిదు రాష్ట్రాలకు కేంద్రం నూతన ఛీఫ్​జస్టిస్​లను నియమించింది. అలాగే 17మంది హైకోర్టు న్యాయమూర్తులకు సైతం స్థానచలనం కల్పించింది. ఆయా బదిలీల్లో భాగంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అరుప్​కుమార్​గోస్వామి ఛత్తీస్​గడ్​కు బదిలీ అయ్యారు. సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యలోని కొలీజియం సిఫారసు మేరక కేంద్రం ఆయా హైకోర్టులకు సీజేలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

About Author