PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు రేంజ్ నూతన డిఐజిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నూతన డిఐజిని మర్యాదపూర్వకంగా కలిసిన… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ .  కాకినాడ ఎపిఎస్పీ 3 వ బెటాలియన్ కమాండెంట్ గా  పని చేస్తూ బదిలీ పై కర్నూలు రేంజ్ డిఐజి గా కర్నూలు కు రావడం జరిగింది.ఈ సంధర్బంగా ఆదివారం కర్నూలు, బి. క్యాంపులోని పోలీసు అతిథి గృహం కు చేరుకున్నారు.  కర్నూలు రేంజ్ నూతన డిఐజి ని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, డిఎస్పీలు, సిఐలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇంతకు మునుపు పని చేసిన కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ ఎపి ఆక్టోపస్ డిఐజి గా  బదిలీ పై వెళ్ళారు. రేపు (సోమవారం 05.02.2024)  ఉదయం 9  గంటలకు కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో సిహెచ్. విజయరావ్ ఐపియస్   నూతన డిఐజి గా  పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన డిఐజి ని కలిసిన వారిలో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు,  కర్నూలు సబ్ డివిజన్ డిఎస్పీ విజయశేఖర్,   స్పెషల్ బ్రాంచ్ సిఐ  నాగరాజ్ యాదవ్ , కర్నూలు త్రీ టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి,  ఆర్ ఐ పోతల రాజు,  కర్నూలు డిఐజి మేనేజర్ వాసు దేవ్  ఉన్నారు.

About Author