PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు ప‌ర్యట‌న‌తో కొత్త జోష్ ..

1 min read
ప్రచారంలో పాల్గొన్న టీజీ భరత్​

ప్రచారంలో పాల్గొన్న టీజీ భరత్​

టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టి.జి భ‌ర‌త్‌
పల్లెవెలుగు, కర్నూలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రావ‌డం నాయ‌కులు, కార్యక‌ర్తల్లో కొత్త జోష్ నింపింద‌ని క‌ర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టి.జి భ‌ర‌త్ అన్నారు. శుక్రవారం న‌గ‌రంలోని 13, 16 వార్డుల్లో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి పర్యటించారు. బంగారుపేట‌లో ప్రచారం ప్రారంభించి, అనంత‌రం మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా ఉన్న 16వ వార్డులోని బుధ‌వార‌పేట‌లో ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు అభ్యర్థిగా ఎం.వి జ్యోతిర్మయిని, 16వ వార్డు అభ్యర్థిగా బి. విజ‌య‌కుమారిల‌ను గెలిపించాల‌ని ప్రజ‌ల‌ను కోరారు. ఈ సందర్భంగా టీజీ భరత్​ మాట్లాడుతూ క‌ర్నూలులో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని, తమ గెలిపించి వార్డుల్లో స‌మ‌స్యలు లేకుండా చేసుకోవాల‌న్నారు. అధినేత చంద్రబాబు ప‌ర్యట‌న‌తో క‌ర్నూల్ టిడిపి మ‌యం అయిపోయింద‌న్నారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల ముందు బాబు ప‌ర్యట‌న‌తో నాయ‌కులు, కార్యక‌ర్తల్లో ఉత్సాహం పెరిగింద‌ని.. ప్రజ‌లు టిడిపి వైపు ఉన్నార‌ని తెలుస్తోంద‌న్నారు. ఈ కార్యక్రమంలో వార్డుల నాయ‌కులు విఠ‌ల్ శెట్టి, స‌త్యంగౌడ్‌, రామాంజ‌నేయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author