NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధ్యతలు చేపట్టిన మిడుతూరు నూతన ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎస్.గంగావతి శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.ఎన్నికలు ఉన్నందున అధికారుల బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా చెన్న కొత్తపల్లి మండల ఎంపీడీవోగా పనిచేస్తూ ఈమె ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి అనంతపురం జిల్లాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే.ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు.అదేవిధంగా మిడుతూరు తహసిల్దారుగా పనిచేస్తున్న ఎస్ ప్రకాష్ బాబు కడప జిల్లా చెన్నూరు మండల తహసిల్దార్ గా బదిలీ అయి ఆయన అక్కడ బాధ్యతలు చేపట్టారు.ఈయన 14.06.2023 న మిడుతూరు తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టి మండలంలో ఎనిమిది నెలల పాటు పనిచేసి బదిలీపై వెళ్లారు.

About Author