PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పండుగ‌ల వేళ రాత్రిక‌ర్ఫ్యూ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోన వేళ రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. అవ‌స‌ర‌మైతే క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. పాజిటివిటి ఎక్కువ‌గా ఉన్న జిల్లాల‌పై రాష్ట్రాలు దృష్టిసారించాల‌ని సూచించారు. ముప్పు రాక ముందే జాగ్ర‌త్త‌ప‌డాల‌ని చెప్పింది. ఆంక్ష‌లు క‌నీసం 14రోజులు అమ‌లులో ఉండేలా చూడాలని సూచించింది.

                                

About Author