NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్మలగిరి క్షేత్రా ఉత్సవాలు..

1 min read

– సందర్శించునున్న వాటికన్ రాయబారి
– మోస్ట్ రెవరెండ్ లియో ఫోర్డ్ జిరెల్లి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా నగరంలో ఈనెల 23వ తేదీన వాటికన్ రాయబారి మోస్ట్ రెవరెండ్ లియోఫోర్డ్ జిరెల్లి పర్యటించనున్నారని ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర తెలిపారు. బిషప్ హౌస్ లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పర్యటనలో భాగంగా ఆర్ సి ఎం చర్చిలో ఉదయం ఏడు గంటలకు దివ్య పూజ 10 గంటలకు పుర ప్రముఖులతో భేటీ అనంతరం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ని సందర్శిస్తారని తెలిపారు. గౌరీపట్నం లో ఉన్న నిర్మలగిరి క్షేత్రాన్ని దర్శించి దివ్య పూజా బలిని సమర్పిస్తారని తెలిపారు. ఇండియా నేపాల్ రాయబారి లియోఫోర్డ్ జిరెల్లి ఇటలీ దేశంలో జన్మించి 2017 సెప్టెంబర్ 13వ తేదీన వాటికన్ రాయబారిగాను. జెరూసలేము పాలస్తీనా దేశానికి 20 21 మార్చి 13వ తేదీన ఇండియా నేపాల్ దేశాలకు పరిశుద్ధ పోపు గా నియమితులయ్యారన్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఈడీ కాలేజ్ కస్పాండెంట్ ఫాదర్ బాల. డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ ఫాదర్ జి మోజేష్. ఫాదర్ మైకేల్. ఫాదర్ రాజు. ఫాదర్ ఇమ్మానియేల్. ఫాదర్ బాబు జార్జి. ఫాదర్ తోట ఆంతోని తదితర ఫాదర్ లు పాల్గొన్నారు.

About Author