NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నితీశ్ బీజేపీ కోవ‌ర్ట్ : ప‌్ర‌శాంత్ కిషోర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలు ఐక్యం కావాలంటూ సుడిగాలి పర్యటన చేస్తోన్న జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీని కలుసుకున్నప్పుడు నితీశ్ హావభావాలను చూడండంటూ నాలుగు ఫొటోలను జత చేసి ట్వీట్ చేశారు. నితీశ్ చిరునవ్వుతో మోదీకి చేతులు జోడించి నమస్కరించే ఫొటోలను ట్వీట్‌లో జత చేశారు. అయితే ఏ క్యాప్షనూ ఇవ్వకుండానే పీకే ఆ ట్వీట్‌ను కాసేపటికే డిలీట్ చేశారు. నితీశ్‌ బీజేపీ కోవర్ట్ అనే విషయాన్ని ఇప్పటికైనా అందరూ గుర్తించాలనే విషయాన్ని పీకే హైలైట్ చేయాలనుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

                                

About Author