PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షూటింగ్‌లో జాయిన్‌ కానున్న నిత్య

1 min read

సినిమా డెస్క్​: అన్‌లాక్‌ తర్వాత ఫిల్మ్‌ ఇండస్ట్రీ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. పెద్ద హీరోలు సెట్‌లో అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ నెల రెండో వారం నుంచి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఆయనకు జోడీగా నిత్యామీనన్‌ నటిస్తోంది. ఆమె కూడా ఈ నెల 12 నుంచి సెట్‌లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. లాక్‌డౌన్‌ తర్వాత నిత్యా సెట్‌లో అడుగుపెడుతున్న మొదటి సినిమా ఇది.

ఇప్పటికే ఈ మూవీ 50శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. తాజాగా షెడ్యూల్‌లో హీరోయిన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. పవన్‌తో నిత్యామీనన్‌ చేస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది. ఇందులో మరో కీలక పాత్రలో రానా, ఆయనకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తున్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

About Author