PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు డీఏ పెంపు నిర్ణయం తీసుకోలేదు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : గ‌త ఏడాది నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపును పున‌రుద్ధరిస్తూ ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై నుంచి డీఏ పెంపును పున‌రుద్ధరిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ న‌కిలీ డాక్యుమెంట్ చ‌క్కర్లు కొడుతోందని పేర్కొంది. ఇప్పటి వ‌ర‌కు అలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని స్పష్టం చేసింది. క‌రోన నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపును ఈ ఏడాది జూన్ 30 వ‌ర‌కు నిలిపివేస్తూ గ‌త సంవ‌త్సరం ఏప్రిల్ లో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 50 ల‌క్షల ఉద్యోగులు, 61 ల‌క్షల పించ‌నుదారుల పై ప్రభావం ప‌డింది.

About Author