PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పాణ్యం’లో అభివృద్ధి శూన్యం..

1 min read

పల్లెవెలుగు వెబ్,  పాణ్యం: నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో మహాత్మగాంధీ జయంతిని ఆల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ   ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  ఆల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ  వనం వెంకటాద్రి, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్  బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ  పాణ్యం మండలంలో గ్రామాల యొక్క అభివృద్ధి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న గ్రామాలలో  ఉద్యోగం లేక ఉపాధి, లేక  పట్టణాలకు ప్రజలు వలసలకు  పోతూ జీవనం సాగిస్తున్నారని ఆరోపించారు మహాత్మా గాంధీ, ఉపాధి హామీ పని  ప్రవేశపెడితే  అది పూర్తిగా ఏకపక్షం గా నిర్ణయించి  ఉన్నవారికే ఉపాధి కల్పిస్తూ ఏదోకరూపంలో  దళితులు,కు పూర్తిగా వెనుకబడిన వారి కులాలని ముందుకు రానివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు అధికారంలో ఉంటూ వాళ్ల వాళ్లకుసంబందించినవారికే ఉద్యోగాలు, ఇల్లు, సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ రానివారికి కల్లబోల్లి మాటలు అధికారులు చెబుతూ వారికి ఎటువంటి ఉపాధి చూపించక అడిగిన వారిని  బెదిరించడం వారిపై కేసులు పెట్టడం  ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని ఇప్పటికి ఉన్నవారే అధికారంలో  ఉంటూ లేనివారిని పైకి రానివ్వకుండా తొక్కిపడేస్తున్నారని  ఎక్కడపడితే అక్కడ  సభలు పెట్టి ప్రజలు రాకముందే ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ప్రజలపై పన్నుల రూపంలో భారం వేసి  వేలకు వేలు ఇప్పటికి సామాన్యుడి నెత్తిన భారం వేస్తున్నారని  ఇదేనా గాంధీ కలలు కన్నా స్వరాజం ఇప్పటికయినా అధికారులలో మార్పు రావాలని  వారు కోరారు ఈ కార్యక్రమం లో kj శ్రీనివాసరావ్      మహమ్మద్ బాషా   రియాజ్ , చిరంజీవి , తదితరులు పాల్గొన్నారు.

About Author