PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

1 min read

భార్యను హత్య చేసిన భర్త
– అనాథలైన ముగ్గురు చిన్నారులు
పల్లెవెలుగు వెబ్​, గడివేముల: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ తాగుబోతు భార్యను హత్య చేసిన ఘటన గడివేముల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోస్పాడు మండలంం పసురపాడు గ్రామానికి చెందిన మధుకు గడివేముల కు చెందిన మహేశ్వరితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. కూలి పనులు చేసుకుంటూ… గడివేముల ఎస్సీ కాలనీలోని ఏబీఎం చర్చివద్ద నివాసం ఉంటున్నారు. తాగుడుకు బానిసైన మధు.. ప్రతి రోజు రాత్రి మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య మహేశ్వరితో గొడవ పడేవాడు. గురువారం తాగిన మైకంలో.. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో భార్య మహేశ్వరిని భర్త కట్టెతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.


About Author