NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌ద్యం తాగ‌డానికి డ‌బ్బు లేద‌ని.. కొడుకుని అమ్మేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాన‌వ‌త్వం సిగ్గుప‌డే ఘ‌ట‌న చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీలోని మొహమ్మదీ కొత్వాలి ప్రాంతానికి చెందిన జగ్తార్ సింగ్, అతని భార్య క‌న్న కొడుకునే అమ్మేశారు. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ మద్యానికి బానిసలు. వీరిద్దరూ తరచుగా మద్యం సేవించేవారు. రోజూ మద్యం సేవించడానికి డబ్బులు సరిపోకపోవడంతో తమ రెండు నెలల కొడుకును అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నారు. మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుని పిల్లలు లేని నిజాముద్దీన్ అనే వ్యక్తికి తమ కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు. అయితే వీరు వేరే మతానికి చెందిన వ్యక్తికి కొడుకును అమ్మడం కుల పెద్దలకు నచ్చలేదు. వారు పెద్ద సంఖ్యలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రెండు వర్గాలకు సంబంధించినది కావడంతో పోలీసు శాఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

                                            

About Author