PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌నాభా నియంత్ర‌ణ అవ‌స‌రం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: జనాభా నియంత్రణ కోసం ప్రత్యేకమైన విధానం ఉండాలని, అది అన్నివర్గాలు, మతాలకు సమానంగా వర్తించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మన దేశంలో ప్రస్తుతం జనాభా నియంత్రణ పాలసీలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘ముస్లింలు, హిందువుల డీఎన్ఏ ఒకటే అయినప్పుడు ఈ అసమానతలు ఎందుకు. మన దేశంలో ఇప్పటికే జనాభా రీప్లేస్ మెంట్ విషయంలో కనీస స్థాయికి చేరుకున్నందువల్ల కొత్తగా జనాభా నియంత్రణ విధానాలేమీ అవసరం లేదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే వృద్ధుల జనాభా పెరుగుతోంది. నిరుద్యోగ యువత ఆ వృద్ధులను సరిగా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముస్లింలలో అయితే జనాభా పెరుగుదల బాగా వేగంగా తగ్గిపోతోంది కూడా..” అని అసదుద్దీన్ పేర్కొన్నారు.

                                               

About Author