PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ పై పున‌రాలోచ‌న లేదు !

1 min read

Vizag Steel

ప‌ల్లెవెలుగు వెబ్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ పై పున‌రాలోచ‌న లేద‌ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భ‌గ‌వ‌త్ కిష‌న్ రావు క‌రాడ్ లిఖిత పూర్వకంగా స‌మాధాన‌మిచ్చారు. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని రాజ‌కీయ పార్టీలు, కార్మిక సంఘాలు ,పౌర స‌మాజం డిమాండ్ చేస్తోంది. కొన్ని నెల‌లుగా విశాఖ‌లో ఆందోళ‌న కొన‌సాగుతోంది. కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొన‌సాగుతున్నాయి. ఆగస్టు 1,2 వ తేదిన ‘చ‌లో పార్లమెంట్ ’ చేప‌డుతున్నట్టు కార్మిక సంఘాలు ప్రక‌టించాయి.

About Author