PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నోకియా స్మార్ట్ ఫోన్.. సింగిల్ చార్జింగ్ తో మూడు రోజులు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: నోకియా స‌రికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. నోకియా బ్రాండ్లపై స్మార్ట్ ఫోన్ లు విడుద‌ల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబ‌ల్ భార‌త్ లో కొత్త స్మార్ట్ ఫోన్ విడుద‌ల చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకొచ్చిన ఈ ఫోన్ పేరు నోకియా జీ20. దీని ధ‌ర 12,999 రూపాయ‌లు. క్వాడ్ కెమెరాతో వ‌స్తున్న ఈ ఫోన్ లో గొప్ప ఆక‌ర్ష‌ణ దాని బ్యాట‌రీ. ఒక్క‌సారి బ్యాట‌రీని చార్జింగ్ చేస్తే మూడు రోజుల పాటు ఫోన్ వినియోగించుకోవ‌చ్చని హెచ్ఎండీ చెబుతోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ అంత‌ర్గత మెమొరీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ జులై 15 నుంచి అందుబాటులోకి రానుంది. అడ్వాన్స్డ్ బుకింగ్ లు ఈనెల 7 నుంచి ప్రారంభంకానున్నాయి. నోకియా ఇండియా వెబ్ సైట్, అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

About Author