NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన నామినేషన్ పక్రియ

1 min read

– పోటీలో జనసేన పార్టీ అభ్యర్థి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండల కేంద్రం పగిడ్యాల గ్రామ పంచాయతీ లోని తొమ్మిదోవ వార్డు  ఉప ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగిసింది. వార్డుకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. తొమ్మిదోవ వార్డుకు జనసేన పార్టీ తరుపున గుండెపోగు చిన్న ఈశ్వరయ్య, టీడీపీ తరపున మీనిగ బాబు  అధికార వైసీపీ అభ్యర్థిగా గుండెపోగు సాంబశివుడు  నామినేషన్‌ వేయగా అదే పార్టీకి చెందన మరో వ్యక్తి కాటేపోగు విద్యాసాగర్ నామినేషన్‌ వేశారు. వైసీపీ  నాయకులు మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి  ,గ్రామ సర్పంచి పేరుమాళ్ళ శేషన్న  తదితరులతో కలిసి వైసీపీ అభ్యర్థి విద్యాసాగర్, సాంబశివుడు లు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి సుభాన్ కు  అందజేశారు.

జడ్పీటీసీ, సర్పంచ్​, టీడీపీ, వైసీపీ,

About Author