PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శికి నాన్ బెయిల‌బుల్ వారెంట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ఆర్ధిక శాఖ కార్మదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. విద్యా శాఖ బిల్లుల చెల్లింపు అంశంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌, విద్యాశాఖప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ , విద్యాశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ హాజరయ్యారు. సత్యనారాయణ గైర్హాజరయ్యారు. విద్యాశాఖ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని సీనియర్‌ న్యాయవాది అంబటి సుధాకర్‌ రావు వాదనలు వినిపించారు. గైర్హాజరైన సత్యనారాయణకు జస్టిస్‌ బట్టుదేవానంద్ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

                                            

About Author