PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోయిన్ పై నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఇక జైలుకేనా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయింది. నాలుగేళ్ల క్రితం నమోదైన ఓ చీటింగ్ కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కి చెందిన ఏసీజేఎమ్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఏప్రిల్ 25న కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. మొరాదాబాద్‌లోని కట్ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ ఢిల్లీలో ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేశాడు. దానికి నటి సోనాక్షి సిన్హాని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. అందుకోసం ఈ భామకి ముందే రూ.37 లక్షలు ఇచ్చాడు. కానీ, ఈ బ్యూటీ ఆ ఈవెంట్‌కి హాజరు కాలేదు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్‌కి డబ్బును తిరిగి ఇవ్వమని అడగగా.. అందుకు ఆమె మేనేజర్ నిరాకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఆర్గనైజర్ 2019లో సోనాక్షిపై చీటింగ్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విషయమై తన స్టేట్‌మేంట్ ఇవ్వడానికి నటి పలుమార్లు మొరాదాబాద్ వచ్చినట్లు సమాచారం. కానీ.. ఆ తర్వాత ఆమె విచారణకి హాజరుకాకపోవడంతో తాజాగా సోనాక్షిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

                                 

About Author