PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీలకతీతంగా.. సంక్షేమ ఫలాలు

1 min read

– ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, ఆదోని : రాజకీయం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం… తమదేనని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి అన్నారు. గురువారం వాల్మీకి నగర్​కు చెందిన బోయ నాగన్న, బోయ పర్సప్పకు కొత్తగా మంజూరైన వృద్ధాప్య పింఛన్​ను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం వారి కార్యకర్తలకు, నాయకులకు పథకాలు వర్తింపజేసిందని, సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆదోనిలో మెడికల్​ కళాశాల, బైపాస్​ రోడ్డు ఏర్పాటు చేస్తుండటం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి దేవ, మాజీ కౌన్సిలర్ సుధాకర్, కన్నా, సచివాలయం సిబ్బంది వీరేష్ , రామకృష్ణ, అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author