PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్కొక్క‌రినీ కాదు.. మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని ఒకేసారి జైల్లో వేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తుండడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇలా ఒక్కరొక్కర్ని అరెస్ట్ చేయడం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయమండంటూ భారతీయ జనతా పార్టీకి ఆయన సవాల్ విసిరారు. ‘‘ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. విచారణ చేసుకోండి’’ అంటూ గట్టిగానే చెప్పారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ విచారణ పేరు మీద సమయం వృధా అవుతోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఆటంకంగా మారుతోందని, అందుకే ఒకేసారి అందరినీ అరెస్ట్ చేసి విచారిస్తే.. ఆ తర్వాత తాము తమ పని నిర్వర్తించుకుంటామని కేజ్రీ వివరణ ఇచ్చారు.

                               

About Author