NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంలేదు !

1 min read

పల్లెవెలుగు వెబ్: స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేదంటూ ప్రక‌ట‌న చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయ‌డంతో ఆశ్చర్యపోవ‌డం అంద‌రివంత‌యింది. ప్రస్తుతం అజంఘ‌డ్ పార్లమెంటు స్థానం నుంచి అఖిలేశ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌క‌పోయినా.. ఎస్పీ బీజేపీకి గ‌ట్టిపోటీ ఇవ్వనుంది. అఖిలేశ్ ఇప్పటికే ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు కుదుర్చుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. ఆర్ ఎల్డీ తో ఇప్పటికే పొత్తు ఖరారైంద‌ని అఖిలేశ్ చెప్పారు.

About Author