PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారికి నోటీసులు అంటే దిగజారుడుతనమే: నారా లోకేష్

1 min read

పల్లెవెలుగు వెబ్: వైఎస్ జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు ఆటంకం కల్గిస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్ ఓ ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు రచ్చ చేసేందుకు అడ్డురాని నిబంధనలు.. అమరావతి రైతుల పాదయాత్రకే అడ్డొచ్చాయా? అని ప్రశ్నించారు. నడిరోడ్డుపై వైసీపీ నేతలు చేసిన గుండాగిరిని అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న వారికి నోటీసులివ్వడం పోలీసుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. రాజధాని అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని.. అయినా ఉద్యమం ఆగదని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

About Author