PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి దశ అడ్మిషన్లు ఈనెల 27 నుంచి ప్రారంభిస్తారు. వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. గడువు తేదీ కూడా అదే. జూలై 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్‌, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌, బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కళాశాలలు, ఒకేషనల్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ తేదీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

                                        

About Author