PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

1 min read

– మిని మహానాడు కార్యక్రమంలో భాగంగా

– విశ్వవిఖ్యాతనటసార్వభౌముడు శ్రీ నందమూరితారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలు నంద్యాల పార్లమెంట్ లో….

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ.శే. డా. ఎన్టీఆర్  శత జయంతి ఉత్సవాలు ఈ రోజు (24.05.2023) బుధవారం సాయంత్రం నంద్యాల పట్టణం లోని హృదయ ఇన్ బ్యాంకేట్ హాల్ లో  నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 27,28 తేదీలలో రాజమండ్రి లో జరిగే మహానాడు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి మహానాడు కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ  వ్యవస్థాపకo నుండి ఉన్న సీనియర్ నాయకులు ఎమ్మెల్సి యన్ యం డి ఫరూక్ ని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ గౌరు వెంకట రెడ్డి ,టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సి యన్ యం డి ఫరూక్ ,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి , పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి , శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ,నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ,డోన్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి , నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ గ. నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గల మండల మరియు గ్రామ స్థాయి టిడిపి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు .

About Author