PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ మహా నాయకుడు.. : టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్, ఆ పార్టీ నాయకులు పీజీ నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొని స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చి. గౌరవించాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు రూపంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయారని  వివరించారు. ఎన్టీఆర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని వివరించారు. అనంతరం ప్రజలకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

About Author