NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజధానిలో  డా.ఎన్టీఆర్ హెల్త్​ ట్రస్టుకు స్థలం కేటాయించండి

1 min read

సీఎం చంద్రబాబు నాయుడును కోరిన డా.ఎన్టీఆర్​  హెల్త్​ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్​

కర్నూలు ( హాస్పిటల్​ ), న్యూస్​ నేడు :ఆంధ్ర ప్రదేశ్​ రాజధాని అమరావతిలో డా. ఎన్టీఆర్ హెల్త్​ యూనివర్శిటీ తరుపున కాలేజి, హాస్పిటల్​ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని  సీఎం చంద్ర బాబు నాయుడును డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వీసీ, ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్ర శేఖర్​ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు నాయుడును విజయవాడలో కలిసి ట్రస్టు స్థలానికి సంబంధించి ప్రతిపాదనలు అందించారు. ఈ సందర్భంగా వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో 30 ఎకరాలు డా. ఎన్టీఆర్​  ట్రస్టుకు కేటాయిస్తే బాగుంటుందన్నారు.  ఆ స్థలంలో కాలేజి, ఆస్పత్రి ఏర్పాటు చేస్తే… భవిష్యత్​లో యూనివర్శిటీ అభివృద్ధికి బాటలు  వేయడంతోపాటు ప్రజలకు కార్పొరేట్​ స్థాయిలో వైద్యం అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు…  రాజధాని నిర్మాణంలో భాగంగానే డా. ఎన్టీఆర్​ హెల్త్​ ట్రస్టుకు స్థలం కేటాయించేలా చూస్తానని  స్పష్టం చేసినట్లు వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *