PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మార్వో ఆఫీస్‌కెళ్లిన ఎన్టీఆర్‌‌..

1 min read

సినిమా డెస్క్​ : పని ఉండి టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లారు. ఆ ప్రాంతంలో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు గాను ఎన్టీఆర్ ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ ఆయన్ని చూసిన ఆఫీస్‌ స్టాఫ్​ సంతోషంతో తలమునకలై పోయారు. అంతేకాదు ఎమ్మార్వో సహా అక్కడ ఆఫీస్ అధికారులు ఇతర సిబ్బంది ఎన్టీఆర్ తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారందరితో కూడా ఎన్టీఆర్ ఫొటోలు దిగి వారితో కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఎమ్మార్వో ఆఫీస్ అధికారులతో మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున స్థానిక అభిమానులు కూడా అక్కడకు చేరుకోవడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది.

About Author