NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు                  

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :    విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి 27 వ వర్ధంతి వేడుకలు స్థానిక టీడీపీ కార్యాలయంలో బుదవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న ఆశయంతో ఎన్టీఆర్ తెలుగదేశం పార్టీని స్థాపించారని అన్నారు.  ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి గుడిసె నరసింహులు యాదవ్  టిఎన్టియుసి కమిటీ సభ్యులు  తెలుగుదేశంపార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

About Author