NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య @ 12..!

1 min read

పల్లెవెలుగు వెబ్​ :దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మ‌హారాష్ట్రలో మ‌రో ఏడు కేసుల‌ను గుర్తించారు. ఇప్పటికి మొత్తం 12కేసుల‌ను దేశ‌వ్యాప్తంగా గుర్తించారు.  ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నైజీరియా నుంచి వచ్చిన తల్లీ కుమార్తెలతో పాటు ఆమె సోదరుడు, అతని ఇద్దరు కుమార్తెలు కలిపి మొత్తం ఆరుగురికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి శాంపిల్స్ ను పూణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో పరీక్షల కోసం పంపారు. ఈ సాయంత్రం నివేదికలు రాగా, ఆరుగురికీ  ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది.  పూణేకు చెందిన 47 ఏళ్ల మరో వ్యక్తికి కూడా  ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అధికారులు తెలిపారు.

About Author