PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు భద్రత నియమాలు పాటించండి:ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు:వాహనదారులు రోడ్డు నియమాలను పాటించకపోతే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మిడుతూరు ఎస్సై జి.మారుతి శంకర్ వాహనదారులను హెచ్చరించారు. స్థానిక మండల కేంద్రం ఆటో స్టాండ్ దగ్గర సిబ్బందితో కలిసి ఎస్సై వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటోలలో ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోరాదని అన్నారు.వాహనాలకు సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడప రాదని అన్నారు.ఈకార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య, నాగన్న,రేణు ప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

About Author