PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ స్థాయి అంపైర్‌గా ఓబుల్‌రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్  చాగలమర్రి : చాగలమర్రి పట్టణానికి చెందిన వ్యాయామ సంచాలకులు చంద్రఓబుల్‌రెడ్డి బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి అంపైర్‌గా ఎంపికయ్యాడు.చాగలమర్రి కి చెందిన ఓబుల్‌రెడ్డి కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వ్యాయామ సంచాలకులు గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అంపైర్‌గా ఎంపికైన చంద్రఓబుల్‌రెడ్డి  మాట్లాడుతూ గత నెల 2 నుంచి12వరకు రాజస్థాన్‌ లో జరిగిన అర్హత పరీక్షలో పాల్గొని పరీక్ష వ్రాసానన్నారు.ఈ పరీక్షలో అర్హత సాధించి జాతీయ స్థాయి అంపైర్‌గా ఎంపికయ్యానన్నారు.ఈ పరీక్షలో దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి  120 మంది చొప్పున పరీక్షలో పాల్గొనారన్నారు. దేశం మొత్తం మీద 27 మంది అర్హత సాధించగా అందులో తాను ఒకరినన్నారు.జాతీయ స్థాయి అంపైర్‌గా ఎంపికైన చంద్రఓబుల్‌రెడ్డి ని పలువురు అభినందించారు.

About Author