NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్జి జింకా రెడ్డి శేఖర్ ను ప్రశంసించిన అధికారులు

1 min read

– వేలూరు సీ ఎం సీ పై ఇచ్చిన తీర్పుకు దక్కిన ప్రశంస

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: విశాఖపట్నం లో  వినియోగదారుల రక్షణపై జరిగిన వర్క్ షాప్ లో కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శులు, జాయింట్ కార్యదర్శులు, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వినియోగదారుల రాష్ట్ర కమిషన్ జడ్జిలు, జిల్లా వినియోగదారుల కోర్టుల జడ్జిలు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో  ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు జిల్లా జడ్జి జింకా రెడ్డి శేఖర్ ప్రముఖులతో పలు అంశాలపై చర్చించారు. వైద్యుల నిర్లక్ష్యంపై వేలూరు సీ ఎం సీ పై ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ను క్యాప్కో చైర్మన్ నాగేశ్వర రావు సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తీర్పు పట్ల ప్రతినిధులు రెడ్డి శేఖర్ ను ప్రశంసించారు.

About Author