PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు జిల్లాలో ఒమిక్రాన్ కల‌వ‌రం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌పంచ వ్యాప్తంగా భ‌యాందోళ‌న సృష్టిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లో కూడ చాపకింద నీరులా విస్త‌రిస్తోంది. తాజాగా క‌ర్నూలు జిల్లా డోన్‌లో ఒమైక్రాన్ కలకలం రేగింది. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు ఒమైక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దుబాయ్‌లో బంధువుల దగ్గరకు వెళ్లొచ్చిన దంపతులకు పరీక్షలు నిర్వహించగా ఒమైక్రాన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. రిపోర్టులో అధికారులు ఒమైక్రాన్‌గా నిర్ధారించారు. దాంతో ఆ దంపతులను క్వారంటైన్‌కు తరలించారు.

About Author