PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ లో ఒమిక్రాన్.. రెండు కేసులు న‌మోదు

1 min read

పల్లెవెలుగు వెబ్​: క‌రోన వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భార‌త్ లో ప్రవేశించింది. క‌ర్ణాట‌క‌లో ఇద్దరికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కేసులు ఇండియాలో న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. 46 ఏళ్లు, 66 ఏళ్ల గ‌ల ఇద్దరు పురుషులు ఈ వైర‌స్ బాధితుల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యద‌ర్వి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. వీరిలో ఒక‌రు న‌వంబ‌ర్ 11న‌, మ‌రొక‌రు న‌వంబ‌ర్ 20న ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ వైర‌స్ కు సంబంధిచిన కేసుల్లో ల‌క్షణాలు చాలా త‌క్కువ‌గా ఉన్నట్టు గుర్తించామ‌ని ఆయ‌న తెలిపారు.

About Author