NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒమిక్రాన్ వేరియంట్.. కోలుకున్న బాధితుడు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశ‌వ్యాప్తంగా టెన్షన్ నెల‌కొంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ‌న‌వ‌రి, ఫిబ్రవ‌రిలో కేసుల సంఖ్య తీవ్రమ‌వుతోంద‌న్న వార్తల నేప‌థ్యంలో గుడ్ న్యూస్ ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ బారినపడ్డ బెంగుళూరు 46 ఏళ్ల డాక్టర్‌ కోలుకున్నారని, ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని వెల్లడించాయి. ప్రైమరీ కాంటాక్టులు అయిన ఆయన భార్య, కూతురు, మరో డాక్టర్‌ కూడా కోలుకుంటున్నారని తెలిపాయి. వారందరి చికిత్స కోసం ఆస్పత్రిలో 60 పడకలతో ఉన్న ఓ వార్డు మొత్తం కేటాయించామని ఆస్పత్రి వ‌ర్గాలు చెప్పాయి.

About Author