PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్.. భార్య, పిల్లల్ని హ‌త‌మార్చిన డాక్టర్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఉత్తర‌ప్రదేశ్ లో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ తో డిప్రెష‌న్ కు గురైన డాక్టర్ త‌న భార్య పిల్లల్ని చంపిన ఘ‌ట‌న కాన్పూర్ లో వెలుగులోకి వ‌చ్చింది. కాన్పూర్ న‌గ‌రంలోని క‌ళ్యాణ్ పూర్ కు చెందిన ఓ డాక్టర్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. డిప్రెష‌న్ లో త‌న భార్య పిల్ల‌ల్ని చంపి అక్కడి నుంచి ప‌రారీ అయ్యాడు. డిప్రెష‌న్ లో తాను ఘ‌ట‌న‌కు పాల్పడిన‌ట్టు త‌న సోద‌రుడికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప‌రారీలో ఉన్న డాక్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

About Author