PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐఎన్‌యూ ఆధ్వ‌ర్యంలో మార్చి 10న కిడ్నీర‌న్‌

1 min read

* పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన వైద్యులు

* అంద‌రికీ కిడ్నీ ఆరోగ్య‌మే ల‌క్ష్యం

* ఆ దిశ‌గా అవ‌గాహ‌న పెంచేందుకు గ‌చ్చిబౌలి స్టేడియంలో ర‌న్‌

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్: ప్ర‌పంచ కిడ్నీ డే సంద‌ర్భంగా మార్చి 10న ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే ఉద్దేశంతో న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆధ్వ‌ర్యంలో కిడ్నీర‌న్ నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను  ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఆవిష్క‌రించారు. అన్ని వ‌య‌సుల వారూ త‌మ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం, అందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతోనే ఈ కిడ్నీర‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రి హైటెక్ సిటీ శాఖ అధిప‌తి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ దీప‌క్ రాగూరి తెలిపారు. ఏఐఎన్‌యూ కిడ్నీ రన్ అనేది కిడ్నీ ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి, ఆరోగ్య‌వంతంగా ఉండాల‌నే సంస్కృతిని పెంపొందించ‌డానికి ఉద్దేశించిన కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం. ఈ రన్ అంబాసిడర్ల మద్దతుతో, వ్యక్తులు, స‌మూహాల‌పై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం ఈ కార్యక్రమం లక్ష్యం. కిడ్నీల‌ ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్ర‌జ‌ల‌నుప్రేరేపించడానికి అంకితమైన కార్యక్రమం ఇది. కిడ్నీ ఆరోగ్యంపై అవగాహనను ప్రోత్సహించడంలో, సామాజిక‌ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపడంలో వ్యక్తులను ఏకం చేయడానికి వార్షిక రన్ ఈవెంట్ ఒక మంచి వేదికగా పనిచేస్తుంది. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఇంకా సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ క్రాంతికుమార్, క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ వ‌రుణ్ మామిడి పాల్గొన్నారు. మార్చి ప‌దో తేదీన నిర్వ‌హించే ఈ ప‌రుగుకు అంబాసిడ‌ర్లుగా.. అభిన‌వ్ పాఠ‌క్, జొహ‌న్నా, శ్ర‌వ‌ణ్ ద్విభాష్యం, పూన‌మ్ మెట్టా, సుభాష్ రెడ్డి, సంతోష్ మ‌ల్లారెడ్డి, సంతోషి త‌మ్లుక‌ర్, మ‌ల్లికార్జున్, దేవ‌యాని, పింకీ, రాజ్ సీహెచ్ పాల్గొంటారు. ఈ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా డాక్ట‌ర్ దీప‌క్ రాగూరి మాట్లాడుతూ, “ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో కిడ్నీ హెల్త్ కు పతాకధారులుగా ఉన్న మేము “ఎఐఎన్ యు కిడ్నీ రన్” పేరుతో కిడ్నీ ఆరోగ్య అవగాహనను పెంపొందించడానికి వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది మార్చి 10న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే నాలుగో ఎడిషన్ లో 3,000 మందికి పైగా రన్నర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రపంచ కిడ్నీ డే థీమ్.. అంద‌రికీ అందుబాటులో కిడ్నీ ఆరోగ్య సంర‌క్ష‌ణ” అని తెలిపారు.

About Author