PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేపర్ డ్రెస్ పై.. సెటెర్లు

1 min read

బాలీవుడ్​ ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ మనీష్​ మల్హోత్ర ఇటీవల తన ఇంట్లో ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి పలువురు సెలబ్రిటిలు వెరైటీ డ్రెస్​లు ధరించి హాజరయ్యారు. స్వయంగా మనీష్ మల్హోత్రానే ఆ డ్రెస్‌లను డిజైన్ చేశాడట. కరిష్మా కపూర్‌, మలైకా అరోరా, అమృత అరోరా, గౌరీ ఖాన్‌ తదితరులు ఆ పార్టీకి హాజరయ్యారు. కరణ్ జోహార్ న్యూస్ పేపర్ ప్రింట్ చేసి ఉన్న లాంగ్ షర్ట్, బ్లాక్ ట్రాక్ వేసుకుని వచ్చాడు. ఈ డ్రెస్ బాగా వైరల్ అయింది. ‘అదేం డ్రెస్ నాయనా.. జాగ్రత్తగా చూసుకో.. చిరగరాని చోట చిరిగితే.. ’ అంటూ కరణ్ జోహార్ పేపర్ డ్రెస్‌పై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

About Author