PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు పై రూ. 45 ల‌క్ష‌లు దొరికితే పోలీసుల‌కు అప్ప‌గించారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చ‌త్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్‌ పోలీసు.. రోడ్డుపై తనకు రూ.45లక్షలు దొరికితే పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లోని నవా రాయ్‌పుర్‌ కయబంధా పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిలాంబర్‌ సిన్హా. మనా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారు జామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. దానిని తెరిచి చూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.‘ బ్యాగ్‌ తెరిచి చూడగా మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కానిస్టేబుల్‌. ఆ తర్వాత సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బ్యాగ్‌ను అప్పగించారు.’ అని అదనపు ఎస్పీ సుఖ్నాందన్‌ రాథోడ్‌ తెలిపారు.

About Author