PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

20న శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో  ఉత్తర ద్వార దర్శనం

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం : మండల పరిధిలోని శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో ఈ నెల 20వ (మంగళవారం) తారీఖున భీష్మ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణస్వామిని భక్తులు దర్శించుకునే విధంగా ఆలయ ప్రదాన సేవకుడు డా . కాశీబట్ల సత్యసాయినాథ్ శర్మ సభ్యులు ఆద్వర్యంలో ఏర్పాట్లు చేశారు.ఉదయం 10.00గం.లకు అనపటి  నాగరాజు గురూజీ దివ్య ఆశీస్సులతో సిద్ధ సమాధి యోగ కడప శాఖ ఆధ్వర్యంలో పంచముఖి గాయత్రి మాతా మహాయజ్ఞం* నిర్వహించనున్నారు.మాఘమాసంలో హరిహర దేవతామూర్తులు నిత్యకల్యాణమూర్తులై వెలసిన ఈ ఆలయంలో శుక్ల ఏకాదశికి ఉత్తర ద్వారా దర్శనం చేస్తే అత్యంత శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే అత్యంత శుభప్రదమైన ఈ ఏకాదశినాడు శ్రీ పంచముఖి గాయత్రి మహాయజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. భక్తాదులు అందరూ ఈ మహా యజ్ఞంలో పాల్గొని తరించవలసిందిగా కార్యక్రమ నిర్వాహకులు కోరారు. సాయంత్రం గరుడ వాహనంపై మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వారిని మాడవీధులు ఉ త్సవ నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన సేవకులు *డాక్టర్  కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ* ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేయు    భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

About Author