PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2వ రోజు అంకిరెడ్డి చెరువులో గస్తీ…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని గాజులపల్లె సమీపంలో ఉన్న అంకిరెడ్డి చెరువులో రెండవ రోజు మంగళవారం రాత్రి రెవెన్యూ సిబ్బంది వీఆర్ఏలు గస్తి చేపట్టారు. అక్రమార్కులు అంకిరెడ్డి చెరువు నుండి ఎర్రమట్టి రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తరలించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మండల తాసిల్దార్  జనార్ధన్ శెట్టి పేర్కొన్నారు. నిఘా కంటిన్యూగా కొనసాగుతుందని ఎవరైనా అక్రమంగా ఎర్రమట్టి తరలించడానికి ప్రయత్నిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల కళ్ళుగప్పి ఎలాగైనా ఎర్రమట్టిని తరలించి ఎన్నికల కోడ్ రాకముందు వివిధ చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేయకముందే సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. 

About Author