PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల అభివృద్ధి పై .. సమీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్​, రుద్రవరం; మండల అభివృద్ధిపై ప్రత్యేకదృష్టిసారించాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం రుద్రవరం మండల పరిషత్ సమావేశ భవనంలో మండల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని సంక్షేమ పథకాలు అభివృద్ధి పై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై కార్యానికి వచ్చే ప్రజలకు నిర్లక్ష్యం వహించకుండా పనులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు సూచించారు. గ్రామాలలో ప్రజలకు త్రాగునీరు విద్యుత్ సౌకర్యం పారిశుద్ధ్యం పై చర్యలు తీసుకోవాలని మండల పరిషత్తు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకుడు గంగుల మనోహర్ రెడ్డి గంధం రాఘవరెడ్డి ఆయా శాఖల మండల స్థాయి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author