PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయదశమి సందర్భంగా… భారీ అన్న సమారాధన

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : దసరా పండుగను పురస్కరించుకొని స్థానిక పత్తిబాద్ 4 గుళ్ళ సెంటర్ లో వెoచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.నవరాత్రుల్లో సందర్భంగా అమ్మవారు నియోజకవర్గంలోని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుంపజేయాలని అమ్మవారిని వేడుకున్నారు,తొలుత,స్థానిక కార్పొరేటర్ పోతార్లంక లక్ష్మణ్, బాచి,సోమశేఖర్,మల్లికార్జున్ రావు.తదితరులు ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబుని ఆలయంలోకి తీసుకువెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి. శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను ఈవో శంకర రావు అందజేశారు.

About Author